బాల్య వివాహాలను అరికట్టండి: కలెక్టర్
ABN , First Publish Date - 2023-02-02T00:41:06+05:30 IST
బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు.
నార్పల, ఫిబ్రవరి 1: బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఆమె నా ర్పల సచివాలయం-1ను తనిఖీ చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే చైల్డ్లైన, సీడీపీఓలకు సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భవతులు, బలహీనమైన పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. అనంతరం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. చదువులో వెనుకబడిఉన్న విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వారికి మంచి తర్ఫీదునిచ్చి మంచి ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంతకుమార్, ఆర్డీఓ మధుసూదన, డీఈఓ కృష్ణయ్య, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, అసిస్టెంట్ అలెక్స్ రవి, తహసీల్దార్ నారాయణస్వామి, ఈఓఆర్డీ లక్ష్మీనరసింహా తదితరులు పాల్గొన్నారు.