వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు

ABN , First Publish Date - 2023-05-31T23:55:01+05:30 IST

రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన పాలనతో విసుగుచెందారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు.

వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు

టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు: మాజీ ఎంపీ నిమ్మల

కొత్తచెరువు, మే 31: రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన పాలనతో విసుగుచెందారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేక పోయారని విమర్శించారు. ఉన్న వాటిని కూడా రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిన ఘనుడు జగన అన్నారు. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పిస్తామని ఇచ్చిన సీఎం జగన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఘన కా ర్యం చేశారని వైసీపీ నాయకులు బైకు ర్యాలీ చేసుకున్నారో ప్రజలకే అర్థం కాలేదని ఎద్దేవాచేశారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌పై అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ తక్కువగా ఉంటే మన రాష్ట్రంలో అత్యధికంగా విధిస్తున్నా రని, దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డా రు. ఏ రాష్ట్రంలోలేని విధంగా మన రాష్ట్రంలో చెత్త పన్ను విధిస్తూ చెత్త ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ప్రపంచంలోనే రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ అన్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని రావణకాష్టగా మార్చిన ఘనుడు జగన అన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైందని అన్నారు. ఈ రాక్షస పాల న పోవాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమ న్నారు. చంద్రబాబు సంపదను సృష్టించే వ్యక్తి అయితే జగన సంపదను కొలగొట్టిన వ్యక్తి అని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, పుట్టపర్తి మున్సిపల్‌ మాజీ చైర్మన పీసీగంగన్న, నాయకులు జేసీబీ శ్రీనాథ్‌, లోచర్ల పెద్దన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:55:01+05:30 IST