కియ పరిశ్రమ కార్మికులతో లోకేశ సెల్ఫీ
ABN , First Publish Date - 2023-03-27T00:02:45+05:30 IST
కరువు నేల ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ప్ర భుత్వ హయాంలో పెనుకొండ వద్ద కియ కార్ల పరిశ్రమ ప్రారంభించింది. యువతకు ఉ పాధి, రాష్ర్టానికి ఆదాయం తెస్తున్న కియని సాధించుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో నారా లోకేశ మంత్రిగా పనిచేశారు.
హిందూపురం, మార్చి 26: కరువు నేల ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ప్ర భుత్వ హయాంలో పెనుకొండ వద్ద కియ కార్ల పరిశ్రమ ప్రారంభించింది. యువతకు ఉ పాధి, రాష్ర్టానికి ఆదాయం తెస్తున్న కియని సాధించుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో నారా లోకేశ మంత్రిగా పనిచేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఆదివారం సా యంత్రం గోరంట్ల మండలంలోకి ప్రవేశించాక, రోడ్డుపై వస్తుండగా కియ పరిశ్రమకు చెందిన ఉద్యోగులను తీసుకువస్తున్న బస్సు లోకేశ వద్దకు వచ్చింది. రాగానే బస్సుని చూసి లోకేశ అమితానందంతో బస్సులో ఉన్న ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది విజయం తెచ్చిన కిక్లా ఉంటుందని లోకేశ అన్నారు. సంక్షోభాల్లో అవకాశాల ను సృష్టించడం విజనరీ చంద్రబాబు ట్రేడ్ మార్క్ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కార్ల ప రిశ్రమను పెనుకొండకు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. లోకేశ సెల్ఫీ దిగడంతో బస్సులో ఉన్న ఉద్యోగులు ఈలలు, కేకలతో సందడి చేశారు.