మహిళపై చిరుత పిల్లల దాడి

ABN , First Publish Date - 2023-03-31T00:30:50+05:30 IST

మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో మాదినేని సుబ్బమ్మ అనే మహిళపై చిరుత పిల్లలు దాడి చేశాయి.

మహిళపై చిరుత పిల్లల దాడి

రాప్తాడు, మార్చి 30: మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో మాదినేని సుబ్బమ్మ అనే మహిళపై చిరుత పిల్లలు దాడి చేశాయి. తల్లి నుంచి విడిపోయి, దారి తప్పిన రెండు చిరుత పిల్లలు గ్రామ శివారులోని చెరువు పరిసర ప్రాంతాలకు చేరాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పిల్లలు సుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్థులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో అవి పారిపోయాయి. బాధితురాలిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చిరుత పిల్లల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:30:50+05:30 IST