భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి : జేసీ

ABN , First Publish Date - 2023-06-15T00:19:33+05:30 IST

జిల్లాలో జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టరు టీఎస్‌ చేత న ఆదేశించారు.

భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి : జేసీ

పుట్టపర్తిరూరల్‌, జూన 14: జిల్లాలో జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టరు టీఎస్‌ చేత న ఆదేశించారు. బుదవారం స్థానిక కలెక్టరేట్‌లోని కోర్టు చాంబర్‌ హాల్‌లో జాతీయరహదారుల భూసేకరణపై జేసీ సమీక్షించారు. జిల్లాలో 544-డీ, 342, 716-జీ జాతీయ రహదారులకు భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ భాగ్యరేఖ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ రామకృష్ణ, జిల్లా ఉద్యానవన అధికారి చంద్రశేఖర్‌, డీఈలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-15T00:19:33+05:30 IST