ఇనచార్జ్‌ డీఈఓగా క్రిష్ణయ్య బాధ్యతలు

ABN , First Publish Date - 2023-01-18T00:35:32+05:30 IST

అనంతపురం జిల్లా ఇనచార్జ్‌ డీఈఓగా క్రిష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇనచార్జ్‌ డీఈఓగా పనిచేస్తున్న వెంకటక్రిష్ణారెడ్డిని రిలీవ్‌ చేయడంతోపాటు ఇనచార్జ్‌ బాధ్యతలను ఏడీ క్రిష్ణయ్యకు అప్పగించారు.

ఇనచార్జ్‌ డీఈఓగా క్రిష్ణయ్య బాధ్యతలు
ఇనచార్జ్‌ డీఈఓ క్రిష్ణయ్యకు అభినందనలు

అనంతపురం విద్య, జనవరి 17 : అనంతపురం జిల్లా ఇనచార్జ్‌ డీఈఓగా క్రిష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇనచార్జ్‌ డీఈఓగా పనిచేస్తున్న వెంకటక్రిష్ణారెడ్డిని రిలీవ్‌ చేయడంతోపాటు ఇనచార్జ్‌ బాధ్యతలను ఏడీ క్రిష్ణయ్యకు అప్పగించారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఈ నెల 12వతేదీ జీవో4 జారీ చేసిన విషయం విదితమే. దీంతో నియామక ఉత్తర్వుల కాపీలు, జీవో కాపీలు మంగళవారం అందుకున్న ఏడీ క్రిష్ణయ్య ఇనచార్జ్‌ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో డీసీఈబీ కార్యదర్శి లోకేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనాథ్‌, ఆదినారాయణ, సరళ, ఏఎ్‌సఓ ఓబుల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జయచంద్ర, ఏపీఓ నాగరాజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది ఆయనను కలసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-01-18T00:35:35+05:30 IST