ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:59 PM
పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎ ఫ్ఐ, ఏఐఎ్సఎఫ్ విద్యార్థి సంఘాల నాయుకులు డిమాండ్ చేశారు.
హిందూపురం అర్బన, డిసెంబరు 22: పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎ ఫ్ఐ, ఏఐఎ్సఎఫ్ విద్యార్థి సంఘాల నాయుకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ వెంకటే ష్కు శుక్రవారం నాయకులు వినతి ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అనంత తరువాత అంతటి స్థానం కలిగిన హిందూపురంలో డిగ్రీ కళాశాల లేకపోవడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన హిందూపురానికి వచ్చిన సందర్భంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి 5 సవంత్సరాలు పూర్తి కావస్తుందన్నారు. నేటికీ కళాశాల ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఎస్ఎ్ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబావలి, ఏఐఎ్సఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, జయచంద్ర, నరసింహమూర్తి, దేవరాజ్, బాబాఫకృద్దీన, హేమంత, భారత, పవన, నాగరాజు రోహిత, వినయ్, శశికుమార్, సుభాష్, రంగప్ప పాల్గొన్నారు.