దళిత ద్రోహి.. జగన : ఎంఎస్ రాజు
ABN , First Publish Date - 2023-07-21T00:46:46+05:30 IST
సీఎం జగన.. దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. గురువారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో అనంత ఉమ్మడి జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
అనంతపురం అర్బన, జూలై 20 : సీఎం జగన.. దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. గురువారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో అనంత ఉమ్మడి జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వచ్చే నెల 3న అనంత జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు నాయకులు, ఎస్సీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు బంగి నాగ, అనంత ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.