రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

ABN , First Publish Date - 2023-03-31T00:29:47+05:30 IST

ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

ఆత్మకూరు మార్చి 30: ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. ఆత్మకూరుకు చెందిన సాకే రామచంద్ర(52), సాకే ముత్యాలక్క(48) దంపతులు ద్విచక్రవాహనంలో అనంతపురానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. రామచంద్ర ఆర్డీటీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ముత్యాలక్క అనంతపురం నగరంలో పూల వ్యాపారం చేస్తోంది. శ్రీరామనవమి కావడంతో పూల వ్యాపారం కోసం గురువారం తెల్లవారుజామునే బైక్‌పై ఇద్దరూ నగరానికి బయలుదేరారు. వడ్డుపల్లి గ్రామ సమీపంలో బొలెరో వాహనం అతివేగంగా వచ్చి వీరిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని సీజ్‌ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రంగడు యాదవ్‌ తెలిపారు.

Updated Date - 2023-03-31T00:29:47+05:30 IST