కొనసాగిన టీడీపీ రిలే దీక్షలు
ABN , First Publish Date - 2023-09-21T23:39:03+05:30 IST
అనంతపురం అర్బన పరిధిలోని రాం నగర్లో టీడీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం తొమ్మిదో రోజు కొనసాగాయి.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 21 : అనంతపురం అర్బన పరిధిలోని రాం నగర్లో టీడీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం తొమ్మిదో రోజు కొనసాగాయి. ఈ దీక్షల్లో టీడీపీ నాయకులు సుజాత, సరళ, సరోజమ్మ, అలివేలు, కవిత, మణెమ్మ, షరీన, వసుంధర, అయేషా, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, బుజ్జి, శ్రీనివాస్ చౌదరి, వెంకటేష్, రామాంజినేయులు, సాకే చంద్రశేఖర్, శ్రీకాంత, శ్రీనివాస్రెడ్డి, రాము, రవికుమార్, రవికుమార్, మణి రవి, మల్లికార్జునలు కూర్చున్నారు. వీరి దీక్షలకు టీడీపీ నాయకులు సరిపూటి సూర్యనారాయణ, బాంబే డయింగ్ నాగన్న, వెంకటప్ప, సుబ్బయ్య, గాజుల ఆదెన్న, శివబాల, విజయశ్రీరెడ్డి, దేవళ్ల మురళి, డిష్ నాగరాజు, సరిపూటి రమణ, నటేష్ చౌదరి, సుధాకర్ యాదవ్, రాజారావు, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎం లక్ష్మీప్రసాద్, కడియాల కొండన్న, సుధాకర్ నాయుడు, గుర్రం నాగభూషణం, పరంధామలు సంఘీభావం తెలిపారు.