Share News

కొనసాగిన నిరసన

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:33 PM

జిల్లా వ్యాప్తంగా అంగనవాడీల సమ్మె మూడో రోజైన గురువారమూ కొనసాగింది. అంగనవాడీ కేంద్రాలను బంద్‌ చేసి వారు సమ్మె చేపట్టారు.

కొనసాగిన నిరసన
అనంతపురం బిందెల కాలనీలో అంగనవాడీ కేంద్రం తాళం పగలగొడుతున్న సచివాలయ ఉద్యోగి

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌ : జిల్లా వ్యాప్తంగా అంగనవాడీల సమ్మె మూడో రోజైన గురువారమూ కొనసాగింది. అంగనవాడీ కేంద్రాలను బంద్‌ చేసి వారు సమ్మె చేపట్టారు. నార్పల, సీకేపల్లి, రామగిరిలో అధికారులు అంగనవాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారు. సచివాలయ ఉద్యోగులతో అంగనవాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహించేలా చర్యలు తీసుకున్న బెదిరే ప్రసక్తే లేదని... సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగనవాడీలు తెగేసి చెప్పారు. చెన్నేకొత్తపల్లిలో అంగనవాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నార్పలలో అంగనవాడీలు గడ్డి తింటూ.. గంజి తాగుతూ నిరసన తెలిపారు. శింగనమలలో అంగనవాడీలు భిక్షాటన చేసిన నిరసన తెలిపారు. గార్లదిన్నెలో వీరి సమ్మెకు రైతు సంఘం, సీపీఎం నాయకులు మద్దతిచ్చారు. రామగిరిలో వీరి సమ్మెకు టీడీపీ బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, జేబీఎం పార్టీ సభ్యులు మద్దతు పలికారు. కనగానపల్లిలో అంగనవాడీల సమ్మెకు టీడీపీ మండల కన్వీనర్‌ యాతం పోతలయ్య, తెలుగు యువత బట్టాసురేష్‌ చౌదరి, కసుమూర్తి వెంకటేష్‌, పూజారి రాజాకృష్ణ, మాదినేని సుధాకర్‌, తిరుపాల్‌, సీపీఎం నాయకులు మద్దతిచ్చారు.

Updated Date - Dec 14 , 2023 | 11:33 PM