కొనసాగిన దివ్యాంగుల నిరసన

ABN , First Publish Date - 2023-06-02T23:32:08+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన ఫొటోలు పట్టుకుని దివ్యాంగులు శుక్రవారం నిరసన చేపట్టారు.

కొనసాగిన దివ్యాంగుల నిరసన

కుందుర్పి, జూన 2: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన ఫొటోలు పట్టుకుని దివ్యాంగులు శుక్రవారం నిరసన చేపట్టారు. మండ ల కేంద్రంలో వికలాంగుల సంక్షేమ భవన నిర్మాణం కోసం 10 సెంట్ల స్థలాన్ని కేటాయించాలంటూ కుసుమగిరి వికలాంగుల మండల సమాఖ్య పలు మార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగో రోజు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట సీఎం జగన ఫొటోలు పట్టుకుని నిరసన చేపట్టారు. ఆర్డీఓ నిర్లక్ష్యం కారణంగా తమకు స్థలాన్ని స్వాధీన పరచలేకపోతున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు స్థలాన్ని కేటాయించేంతవరకు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దారు విజయకుమారిని వివరణ కోరగా పూర్తి స్థాయిలో తమకు ఉత్తర్వులు అందిన వెంటనే ఆ స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు వసంత, ఉపాధ్యక్షులు రాజేష్‌ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల అధ్యక్షులు వెంకటేష్‌, మర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:32:08+05:30 IST