నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన

ABN , First Publish Date - 2023-03-11T23:52:57+05:30 IST

సార్వత్రి ఎన్నికల ముందు నిరుద్యోగులకు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక సీఎం జగన వారిని మోసం చేశారని టీఎనఎస్‌ఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇర్షాద్‌, తెలుగుయువత జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తిరుమలేశ విమర్శించారు.

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన

టీఎనఎస్‌ఎఫ్‌, తెలుగుయువత నాయకులు

ధర్మవరం, మార్చి 11: సార్వత్రి ఎన్నికల ముందు నిరుద్యోగులకు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక సీఎం జగన వారిని మోసం చేశారని టీఎనఎస్‌ఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇర్షాద్‌, తెలుగుయువత జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తిరుమలేశ విమర్శించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన సీపీఎస్‌ రద్దు హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు ఉపాధి, నిరుద్యోగభృతి హామీలన్నీ ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్‌ రూరల్‌ నాయకులు అశోక్‌, నాయకులు బొగ్గు వినోద్‌, ఎనబీకే హరి, చిన్నూరు నారాయణస్వామి, నాగరాజు, రామకృష్ణ, తారకరామాపురం వినోద్‌, రమేశ, ముత్యాలు, వెంకీ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-11T23:52:57+05:30 IST