వర్గీకరణపై సీఎం జగన మౌనం వీడాలి: మందకృష్ణ

ABN , First Publish Date - 2023-03-25T23:56:12+05:30 IST

ఎస్సీ రిజర్వేషన వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడకపోతే, జగన్మోహనరెడ్డి మాదిగల ఆగ్రహాని కి గురవుతారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.

వర్గీకరణపై సీఎం జగన మౌనం వీడాలి: మందకృష్ణ

గోరంట్ల, మార్చి 25: ఎస్సీ రిజర్వేషన వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడకపోతే, జగన్మోహనరెడ్డి మాదిగల ఆగ్రహాని కి గురవుతారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు టైలర్‌ నా రాయణ ఇటీవల మరణించగా, భార్య వనితమ్మ కుటుంబ సభ్యుల ను మందకృష్ణ శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన వి లేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుదీర్ఘకాలంగా కేం ద్రం పరిశీలనలో ఉందన్నారు. జగన చొరవ చూపడం లేదని, కేం ద్రం దృష్టికి తీసుకెళ్లకపోగా ఎంపీలు సైతం పార్లమెంట్‌లో మాట్లాడటం లేదన్నారు. తండ్రి వైఎ్‌సఆర్‌ ఆశయాల మేరకు పనిచేస్తామంటూనే... మాదిగలకు జగన మొండిచేయి చూపుతున్నారన్నారు. అసెంబ్లీలో దళిత క్రైస్తవుల అంశంపై తీర్మానించి కేంద్రానికి పం పారని, ఎస్సీ వర్గీకరణపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్ర శ్నించారు. సమావేశంలో నాయకులు మధుసూదన, నగేష్‌, ఎల్‌ఐసీ శీన, ఓబులేసు, బేకరి గంగాధర్‌, గంగన్న, కిష్టప్ప, వానవోలు నారాయణ, సైకిల్‌ నరసింహులు, రమేష్‌, బూదిలి లక్ష్మీపతి, రామక్రిష్ణ, నాటకాల గంగప్ప, కేశవ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:56:12+05:30 IST