Share News

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న బీకే

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:02 AM

స్థానిక సీఅండ్‌ఐజీ చర్చిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రీ కిస్మస్‌ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పాల్గొని కేక్‌కట్‌చేశారు.

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న బీకే
సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న బీకే పార్థసారథి

పెనుకొండ, డిసెంబరు 22 :స్థానిక సీఅండ్‌ఐజీ చర్చిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రీ కిస్మస్‌ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పాల్గొని కేక్‌కట్‌చేశారు. శుక్రవారం రాత్రి చర్చిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీకే పార్థసారథి సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలతో కలిసి కేక్‌కట్‌చేసి తినిపించారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్‌ ఫ్రాన్సెస్‌, చర్చి కమిటీ సభ్యులు స్టాండ్లీపాల్‌, జానప్రియనాథ్‌, టీడీపీ నాయకులు రవిశంకర్‌, సిద్దలింగప్ప, సిద్దయ్య, దారపునేని రామలింగ, హుజురుల్లాఖాన, షౌకత, గీత హనుమంతు, వాజీద్‌, హరీ, ఆవుల నరేంద్ర, బెల్లం శివశంకర్‌, వెంకటేశ, చంద్ర, శివ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:02 AM