ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2023-10-06T23:54:29+05:30 IST

ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో యూనియన ఎన్నికలకు శుక్రవారం నామినేషన్లను స్వీకరించారు.

ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం ఎన్నిక

ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం ఎన్నిక

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, అక్టోబరు 6: ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో యూనియన ఎన్నికలకు శుక్రవారం నామినేషన్లను స్వీకరించారు. అన్ని పదవులకు ఒక్కొక్క నామినేషన దాఖలైంది. దీంతో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల ప్రవీణ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్‌ మహమ్మద్‌ అయూఫ్‌, జిల్లా గౌరవాధ్యక్షుడిగా భోగశ్వరరెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జేవీ కంబగిరి, ఉపాద్యక్షులుగా తిప్పేస్వామి, లోకరాజు, లింగప్రసాద్‌, సహాయ కార్యదర్శులుగా ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, రమే్‌షబాబు, పూలశెట్టి చలపతి, కోశాధికారిగా సీహెచ చౌడప్ప ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరాజు, మల్లికార్జున, పి. రామాంజనేయులు, భూమిరెడ్డి, అక్కులప్ప, శివశంకర్‌, మల్లేష్‌, రాము, మల్లికార్జున ఎన్నికయ్యారు.

Updated Date - 2023-10-06T23:54:57+05:30 IST