గరిటెలతో ప్లేట్లు కొడుతూ అంగనవాడీల నిరసన
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:56 PM
సమస్యల సాధన కోసం అంగనవాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది.
(ఆంధ్రజ్యోతి, న్యూస్నెట్వర్క్)
సమస్యల సాధన కోసం అంగనవాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వినూత్నంగా నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు, అంగనవాడీ కార్యకర్తలు, గరిటెలతో పళ్లాలను మోదుతూ తమ నిరసన తెలిపారు. హిందూపురం, పెనుకొండ, మడకశిర, గోరంట్ల, చిలమత్తూరు, రొళ్ల, గుడిబండ, అగళి తదితర చోట్ల నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన నాయకులు మాట్లాడుతూ... తాము 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పంధించి తమ డిమాండ్ల పరిష్కారిని చర్యలు తీసుకోవాలని కోరారు. చిలమత్తూరు అంగనవాడీల సమ్మెకు యూటీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. గోరంట్లలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సతీమణి కమలమ్మ, కుమారుడు సాయికళ్యాణ్ నాయకులతో వచ్చి మద్దతుపలికారు. సీసీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, ఏపీటీఎఫ్ నాయకులు, ఆశా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.