చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-03-27T00:05:21+05:30 IST
మండలంలోని కోనాపురానికి చెందిన సుధాకర్ (43) ఆదివారం గ్రామ సమీప కుముద్వతి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు.
పరిగి, మార్చి 26: మండలంలోని కోనాపురానికి చెందిన సుధాకర్ (43) ఆదివారం గ్రామ సమీప కుముద్వతి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. సుధాకర్ చే పలు పట్టడానికి ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలోపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాని కి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉ న్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.