సడలని దీక్ష

ABN , First Publish Date - 2023-09-23T00:17:47+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టపై హిందూపురంలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది.

సడలని దీక్ష

ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు

హిందూపురం, సెప్టెంబరు 22: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టపై హిందూపురంలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నియోజకవర్గంలోని ఎస్సీసెల్‌ నాయకులు రిలే దీక్షను చేపట్టారు. వారు మాట్లాడుతూ ఉద్యమాలకు ఊపిరిపోసింది దళితులేనని, అలాంటిది మరోసారి అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ దళితులు బాబుకోసం దీక్షలు చేపడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తమను ఎదుర్కొనలేక పోలీసులను అడ్డుపెట్టి వ్యవస్థలు మ్యానేజ్‌చేసి చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ పాపం ఊరికేపోదని వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ ఎస్సీసెల్‌, దళిత సంఘాల నాయకులు కౌన్సిలర్‌ సతీష్‌, హెచఎన రాము, జయసింహ, బేకరి గంగాధర్‌, ఎస్టీసెల్‌ వెంకటరమణ, రామాంజినమ్మ, బేవనహళ్లి మూర్తి, మోతుకపల్లి ఆనందప్ప, నాగార్జున, మోదాశివ, రామాంజి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:17:47+05:30 IST