వైసీపీ వర్గీయులపై కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2023-10-09T22:52:20+05:30 IST

గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దళిత నాగరాజుపై కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి అనుచరులపై కేసులు నమోదు చేయా లని టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

వైసీపీ వర్గీయులపై కేసు నమోదు చేయాలి
నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్‌ నాయకులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌ : గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దళిత నాగరాజుపై కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి అనుచరులపై కేసులు నమోదు చేయా లని టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం బాధితుడు దళిత నాగరాజుతో కలిసి స్పందన కార్యక్రమంలో ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు శశిరేఖ, జయమ్మ, జిల్లా ఉపా ధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, సాకే మురళీకృష్ణ, నాగరాజు, నాగేంద్ర, దివే కృష్ణ మూర్తి, పురుషోత్తం రెడ్డి, ముప్పూరి కృష్ణ, మూలి శ్రీకాంత రెడ్డి, టీడీపీ నాయ కులు నాగార్జున, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు చిన్న ఆంజనేయులు, ఎస్సీ నాయకులు బండారు కుళ్లాయప్ప, రామాంజనేయులు, తాతయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-10-09T22:52:20+05:30 IST