700 కి.మీ. దాటిన యువగళం
ABN , First Publish Date - 2023-03-31T00:23:19+05:30 IST
నారా లోకేశ యువగళం పాదయాత్ర గురువారం 700 కి.మీ. మైలురాయి దాటింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన 55వ రోజు ఈ మార్కు దాటారు.
హిందూపురం, మార్చి 30: నారా లోకేశ యువగళం పాదయాత్ర గురువారం 700 కి.మీ. మైలురాయి దాటింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన 55వ రోజు ఈ మార్కు దాటారు. ఈ సందర్భంగా గుట్టూరు వద్ద జాతీయ రహదారి పక్కన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పౌరుషాల పోరుగడ్డ పెనుకొండ నియోజకవర్గంలో 700 కి.మీ. మైలురాయిని దాటడం ఎంతో ఆనందంగా ఉందని లోకేశ అన్నారు. అదికూడా చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన కియ సమీపంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఎప్పటికీ తకు గుర్తుండిపోయే రోజులని అన్నారు. నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషిచేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.