AP News : ఏపీలో ఆహా క్యాంటీన్ల ఏర్పాటు పేరుతో జగన్ ప్రభుత్వం మరో బురిడీ

ABN , First Publish Date - 2023-09-04T08:35:43+05:30 IST

ఏపీలో ఆహా క్యాంటీన్ల ఏర్పాటు పేరుతో జగన్ ప్రభుత్వం మరో బురిడీకి పాల్పడింది. మహిళలకి స్వయం ఉపాధి, పేదలకి తక్కువ ధరలకే భోజనం అందిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం అరకొర భోజనానికి రూ.30లు వసూలు చేసింది.

AP News : ఏపీలో ఆహా క్యాంటీన్ల ఏర్పాటు పేరుతో జగన్ ప్రభుత్వం మరో బురిడీ

నెల్లూరు : ఏపీలో ఆహా క్యాంటీన్ల ఏర్పాటు పేరుతో జగన్ ప్రభుత్వం మరో బురిడీకి పాల్పడింది. మహిళలకి స్వయం ఉపాధి, పేదలకి తక్కువ ధరలకే భోజనం అందిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం అరకొర భోజనానికి రూ.30లు వసూలు చేసింది. నెల్లూరు మద్రాసు బస్టాండు ప్రాంతంలో రోడ్డు పక్కన టెంట్‌‌లో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మెప్మా, మున్సిపల్ కార్పోరేషన్ సహాకారం పేరుతో నిధులు వెచ్చించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన అన్నా క్యాంటీన్ భవనాలను సచివాలయాలుగా మార్పు చేశారు. అన్నా క్యాంటీన్ ల ద్వారా రూ.5లకే గత ప్రభుత్వం సంపూర్ణ భోజనం అందించింది.

Updated Date - 2023-09-04T08:35:43+05:30 IST