వైసీపీలో రోడ్డున పడ్డ వర్గ విభేదాలు

ABN, First Publish Date - 2022-11-24T18:01:18+05:30 IST

విశాఖ వైసీపీ (YCP)లో వర్గ విభేదాలు రోడ్డుకెక్కాయి. మల్కాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పార్కులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొట్టిమూర్తి, అతడి స్నేహితుడిపై 60వ వార్డు వైసీపీ కార్పొరేటర్ పీవీ సురేష్, అతని అనుచరులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విశాఖపట్నం: విశాఖ వైసీపీ (YCP)లో వర్గ విభేదాలు రోడ్డుకెక్కాయి. మల్కాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పార్కులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొట్టిమూర్తి, అతడి స్నేహితుడిపై 60వ వార్డు వైసీపీ కార్పొరేటర్ పీవీ సురేష్, అతని అనుచరులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్పొరేటర్ (YCP Corporator) పీవీ సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది.

Updated at - 2022-11-24T18:09:11+05:30