రేపు కాజీపేటలో ధూం.. ధాం..
ABN , First Publish Date - 2022-12-08T00:12:34+05:30 IST
దీక్షా దివస్ ముగింపు సందర్భంగా ఈ నెల 9న ఉదయం 10గంటలకు కాజీపేట చౌరస్తాలో ధూం ధాం నిర్వహిస్తున్నట్లు ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తెలిపారు. కాజీపేట మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడారు. దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ సాధించి, రాష్ట్రం అభివృద్ధిదిశలో దూసుకుపోతోందన్నారు. దీక్షా దివస్ సందర్భంగా 11రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముగింపు సందర్భంగా గురువారం అన్ని డివిజన్లలో జెండా ఆవిష్కరణ, 9న కాజీపేట చౌరస్తాలో ధూం.. ధాం.. నిర్వహిస్తున్నామన్నారు.
కాజీపేట, డిసెంబరు 7: దీక్షా దివస్ ముగింపు సందర్భంగా ఈ నెల 9న ఉదయం 10గంటలకు కాజీపేట చౌరస్తాలో ధూం ధాం నిర్వహిస్తున్నట్లు ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తెలిపారు. కాజీపేట మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడారు. దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ సాధించి, రాష్ట్రం అభివృద్ధిదిశలో దూసుకుపోతోందన్నారు. దీక్షా దివస్ సందర్భంగా 11రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముగింపు సందర్భంగా గురువారం అన్ని డివిజన్లలో జెండా ఆవిష్కరణ, 9న కాజీపేట చౌరస్తాలో ధూం.. ధాం.. నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్తోపాటు రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణవాదులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, సుంచు అశోక్, శివ, బి.రంజిత్ పాల్గొన్నారు.