Sharmila.. హనుమకొండ: వంగపల్లి నైట్ క్యాంప్ నుంచి షర్మిల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-11-20T11:22:17+05:30 IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఆదివారం ఉదయం హనుమకొండ, వంగపల్లి నైట్ క్యాంప్ నుంచి ప్రజా ప్రస్థాన పాదయాత్ర (Padayatra) ప్రారంభించారు.

Sharmila.. హనుమకొండ: వంగపల్లి నైట్ క్యాంప్ నుంచి షర్మిల పాదయాత్ర

హనుమకొండ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఆదివారం ఉదయం హనుమకొండ, వంగపల్లి నైట్ క్యాంప్ నుంచి ప్రజా ప్రస్థాన పాదయాత్ర (Padayatra) ప్రారంభించారు. కమలాపూర్ మండల పరిధిలోని శనిగరం, ముత్యాలపల్లి., నడికుడ మండల పరిధిలోని నర్సక్కపల్లి, అంబేడ్కర్ కాలనీ, పరకాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు పరకాల మార్కెట్ రోడ్ వద్ద బహిరంగ సభలో పాల్గొని షర్మిల ప్రసంగించనున్నారు.

కాగా శనివారం హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో షర్మిల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా కేసీఆర్(CM KCR) పథకాల పేరు చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రపంచంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు ఎన్నికలతోనే పని అని.. ఓట్లు వేస్తేనే బయటకు వస్తారన్నారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ను మళ్ళీ నమ్మితే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారని షర్మిల వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-11-20T11:22:20+05:30 IST