తలను బండరాయికి మోది.. బ్లేడ్‌తో నాలుక కోసి

ABN , First Publish Date - 2022-12-07T00:01:54+05:30 IST

ఓ యువ కుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తలను బండారాయికి మోది, బ్లేడ్‌తో నాలుక కోసి పారిపోయారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మంగళవారం సాయం త్రం చోటుచేసుకుంది.

తలను బండరాయికి మోది.. బ్లేడ్‌తో నాలుక కోసి

రేగొండ, డిసెంబరు 6: ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తలను బండారాయికి మోది, బ్లేడ్‌తో నాలుక కోసి పారిపోయారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మంగళవారం సాయం త్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం..

రేగొండ మండలం మడ్తపల్లి గ్రామానికి చెందిన గంధం ఓదెలు వ్యవసాయ ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో మినరల్‌ వాటర్‌ అవస రం కాగా బైక్‌పై అతడు కోటంచ గ్రామానికి బయల్దేరాడు. తిరిగి వస్తున్న క్రమంలో కోటంచ-మడ్తపల్లి గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అటకాయించారు. రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. తలను బండ రాయికి మోది, బ్లేడ్‌తో రెండు ఇంచుల మేర నాలుకను కోసి పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓదెలు రోడ్డుపైకి వచ్చి అపస్మారక స్థితి కి పడిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న పలువురు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో వారు అక్కడికి చేరుకొని ఓదెలును అంబులెన్స్‌ లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఓదెలు మాట్లా డలేకపోతున్నాడని, ఈ దాడికి పాల్పడిందెవరో చెప్పలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వారు ముగ్గురని మాత్రం సైగలతో చెప్ప గలిగాడని, వారు ఈ ఘాతుకానికి పాల్పడటానికి కారణం తెలియరాలేదని అన్నారు. ఈ ఘటనపై రేగొండ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Updated Date - 2022-12-07T00:03:21+05:30 IST