ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-11-10T01:05:42+05:30 IST

ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. బుధవా రం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ఇకో ఇండియాతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాటియా మాట్లాడారు.

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలి

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌భాటియా

బీబీనగర్‌, నవంబరు 9: ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. బుధవా రం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ఇకో ఇండియాతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాటియా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, సామర్థ్యం పెంపుదలలో విప్లవాత్మక మా ర్పులు తీసుకువస్తున్న ఎయిమ్స్‌లో దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అత్యున్నత ఆరోగ్యనిపుణులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తద్వారా ఉన్నతమైన ఫలితాలు ఆశిస్తున్నామన్నారు.

Updated Date - 2022-11-10T01:05:45+05:30 IST