క్రీడల్లో గెలుపోటములు సహజం
ABN , First Publish Date - 2022-12-02T00:15:24+05:30 IST
: క్రీడల్లో గెలుపోటములు సహజమని చేవెళ్ల ఎంపీపీ ఎం.విజయలక్ష్మి అన్నారు.
చేవెళ్ల, డిసెంబరు 1: క్రీడల్లో గెలుపోటములు సహజమని చేవెళ్ల ఎంపీపీ ఎం.విజయలక్ష్మి అన్నారు. చేవెళ్ల గ్రామానికి చెందిన కవాడి చంద్రశేఖర్రెడ్డి జ్ఞాపకార్థం గురువారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి ఆగిరెడ్డి, సీనియర్ నాయకులు రమణారెడ్డి, బాగిరెడ్డి, నాయకులు, యూత్సభ్యులు పాల్గొన్నారు.