బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2022-06-06T05:09:15+05:30 IST
బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్కు ఘనస్వాగతం
ఘట్కేసర్, జూన్ 5 : యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయబడిన ఘట్కేసర్కు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్కు ఆదివారం ఘట్కేసర్లో బీజేపీ నాయకులు ఘనస్వాగత ం పలికారు. కాగా, ఆయన యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తుండటంతో విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఘట్కేసర్లోని యంనంపేట్ చౌరస్తా నుంచి ఓపెన్టాప్ జీప్లో ఘట్కేసర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన లక్ష్మణ్ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎంపీకి స్వాగతం పలికిన వారిలో రామోజీ, బిక్కునాయక్, లక్ష్మారెడ్డి, పోచారం కౌన్సిలర్ గొంగళ్ల మహేష్, హనుమాన్, సోమసాని రమేష్, అంజనేయులు, శోభారాణి, వేముల సంజీవగౌడ్, తదితరులున్నారు.