యాచారంలో 30పడకల ఆసుపత్రి నిర్మిస్తాం
ABN , First Publish Date - 2022-05-29T05:43:27+05:30 IST
యాచారంలో 30పడకల ఆసుపత్రి నిర్మిస్తాం
యాచారం, మే 28: యాచారం మండల కేంద్రంలో త్వరలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, మొండిగౌరెల్లి సర్పంచ్ బి.కృష్ణలతో కలిసి ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో భవన నిర్మాణ పనులను చేపట్టడానికి స్థలపరిశీలన చేశారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపట్ల సంతృప్తి చెందారు.
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కమిషనర్కు వినతి
ఆమనగల్లు, మే 28: ఆమనగల్లు సీహెచ్సీలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీచేసి డయాలసిస్ సెంటర్, ట్రామా హెల్త్కేర్ సెంటర్, మాతా శిశు సంరక్షణ కేంద్రం, డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేఎన్ఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మెకానిక్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనకు శనివారం వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె.అజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు.