తల్లి మృతితో మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-10T00:19:52+05:30 IST
తల్లి లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చేవెళ్ల, డిసెంబరు 9: తల్లి లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ హయూబ్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్ద గ్రామానికి చెందిన మల్లే్షకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు కార్తీక్(13) 7వ తరగతి చదువుతున్నాడు. ఏడాది క్రితం తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి కార్తీక్ మనస్తాపంతో ఉన్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘనంగా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉరేసుకొని యువకుడు..
ఆదిభట్ల: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీ్సస్టేషన్ పరిధి కుర్మల్గూడలో శుక్రవారం మఽధాహ్నం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని కుర్మల్గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే వారణాసి శ్రీశైలం(26) ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.