హత్య కేసులో ఇద్దరు మైనర్లు అరెస్టు
ABN , First Publish Date - 2022-05-20T05:06:57+05:30 IST
వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు మైనర్లను పోలీసులు
కొత్తూర్, మే 19: వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ ఘటన కొత్తూర్ మండలంలో చోటుచేసుకుంది. షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ గురువారం విలేకరుల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్కు చెందిన దిలీప్బోబ్డే(35) కొత్తూర్కు వలసొచ్చి అడ్డా కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల9న రాత్రి దిలీ్ప కొత్తూర్ సమీపంలోని అండర్పాస్ వద్ద హత్యకు గురయ్యాడు. కొత్తూర్కు చెందిన ఇద్దరు బాలలు అపహరించిన ఓ బైక్ను షాద్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అమ్మేందుకు యత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అండర్పాస్ వద్ద దిలీ్పబాబ్డేను తామే చంపామని ఒప్పుకున్నారు. దిలీ్ప మద్యం తాగి అండర్పాస్ వద్ద తూలుతుండగా అటుగా వస్తున్న ఇద్దరు మైనర్లు కిందపడతావని దిలీప్తో అనగా.. అతను వారిద్దరితో ఘర్షణ పడ్డాడు. ఆవేశంతో మైనర్లిద్దరూ రాళ్లతో దిలీప్ తలపై మోది హత్యచేశారు. అతడి వద్ద ఉన్న రూ.11వేలు తీసుకొని పరారయ్యారు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి కొత్తూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ బైక్ను చోరీ చేసి పరారయ్యారు. అదుపులో తీసు కున్న నిందితుల నుంచి బైక్తోపాటు రూ.3,200 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మైనార్టీ తీరని నిందితులను జువైనల్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.