పాడి రైతులకు టీఎ్సడీడీసీఎఫ్ చేయూత
ABN , First Publish Date - 2022-05-15T05:58:49+05:30 IST
పాడి రైతులకు టీఎ్సడీడీసీఎఫ్ చేయూత
కడ్తాల్, మే 14: పాడి రైతులకు ప్రభుత్వం టీఎ్సడీడీసీఎప్ అన్ని విధాల చేయూతనందిస్తుందని కడ్తాల పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ రాధిక అన్నారు. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు బాలకృష్ణ, పుల్లేరుబోడు తండాకు చెందిన జాన్యకూతురు మీనల వివాహం శుక్రవారం జరిగింది. విజయ డెయిరీ పెళ్లి కానుక కింద మంజూరైన రూ.5వేల విలువ గల చెక్కును శనివారం కడ్తాలలో మేనేజర్ రాధిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడిరైతులు, నాయకులు పాల్గొన్నారు.