ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ లీజు
ABN , First Publish Date - 2022-05-27T04:58:13+05:30 IST
ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ లీజు
- వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి
కులకచర్ల, మే26: ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వ భూమిని మైనింగ్కు లీజుకు ఇస్తామని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి తెలిపారు. బండవెల్కిచర్ల పరిధిలోని సర్వే నంబరు 415లో 56 హెక్టార్ల ప్రభుత్వ భూమని రవిశీలంశెట్టి క్వార్డ్, ఫెల్డ్స్పార్కు మైనింగ్కు లీజుకు ఇవ్వడంపై గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, మైనింగ్ ఈఈ పరమేశ్కుమార్ హాజరవగా, మైనింగ్తో వచ్చే దుమ్మువల్ల సమీప రైతుల పొలాల్లో పంట దిగుబడి రాక నష్టపోవల్సి వస్తుందని ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చారు. గతంలో కూడా లీజుకు ఇవ్వడంతో గుట్టలను బ్లాస్టింగ్ చేయడం వల్ల వచ్చిన దుమ్ముతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారన్నారు. పంటలు పండక రైతులు నష్టపోయారని, మైనింగ్కు లీజుకు ఇవ్వొద్దని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్టీవో విజయకుమారి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ జ్యోతిలక్ష్మి, పాలకవర్గ సభ్యులు పాల్గొనకపోవడం గమనార్హం, కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్కుమార్, పరిగిసీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ గిరి, పాంబండ దేవాలయ చైర్మన్ రాములు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.