ట్రాక్టర్ బోల్తా.. బాలిక దుర్మరణం
ABN , First Publish Date - 2022-07-04T05:45:28+05:30 IST
ట్రాక్టర్ బోల్తా.. బాలిక దుర్మరణం
నందిగామ, జూలై 3: పొలం దున్నడానికి వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటన నందిగామ పోలీ్సస్టేషన్ పరిధిలోని చేగూర్ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగూర్ గ్రామానికి చెందిన బల్ల మాధవి వారికున్న పొలం దున్నడానికి గ్రామానికి చెందిన సత్తయ్య ట్రాక్టర్ను రప్పించింది. పొలంలో పనులు జరుగుతుండగా మాధవి కూతురు బల్ల శృతి(15) సరదాకి ట్రాక్టర్పై కూర్చుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఘటనాస్థలంలో తల్లి రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్ సత్యయ్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామయ్య తెలిపారు.