సీసీరోడ్డు పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-04T05:01:18+05:30 IST
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన లభించింది.
- ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
మొయినాబాద్ రూరల్, జూలై 3 : ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన లభించింది. గతనెల 30వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘అస్తవ్యస్తంగా హిమాయత్నగర్ రోడ్డు’ అనే కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అర్ధంతరంగా రోడ్డు పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులతోపాటు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కథనానికి కాంట్రాక్టర్ స్పందించాడు. మధ్యలోనే నిలిపివేసిన రోడ్డు పనులను ప్రారంభించాడు. అసంపూర్తిగా ఉన్న రోడ్డును తవ్వి అందులో సిమెంట్ మిశ్రమాన్ని వేసేందుకు మెటీరియల్ తీసుకువచ్చారు. త్వరలోనే పనులను పూర్తి చేయనున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు.