మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ
ABN , First Publish Date - 2022-05-24T05:49:03+05:30 IST
మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ
ఆదిభట్ల, మే 23: బైక్పై వెలుతున్న దంపతులను ఓ దుండగుడు అడ్డగించి మహిళ మెడలోంచి రెండు తులాల పుస్తెల తాడును అపహరించాడు. ఈ ఘటన సోమవారం రాత్రి ఆదిభట్ల పోలీ్సస్టేషన్ పరిధిలోని బొంగులూరు ఔటర్రింగురోడ్డు జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మండలంలోని తొర్రూర్ గ్రామానికి చెందిన కాసోజు భాస్కరాచారి లావణ్య దంపతులు. వీరి కుమారుడు అక్షిత్తో కలిసి తొర్రూర్ నుంచి బైక్పై ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు. కాగా అవుటర్రింగురోడ్డు బొంగులూర్ జంక్షన్ వద్ద ఓ దుండగుడు వీరు వెళ్తున్న బైక్కు అతిదగ్గరగా తెచ్చి లావణ్య మెడలోంచి పుస్తెలతాడును అపహరించాడు. వెంటనే దుండగుడిని వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిభట్ల సీఐ నరేందర్కు ఫిర్యాదు చేశారు.