యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2022-10-11T05:38:56+05:30 IST
యువతి అదృశ్యం
దోమ, అక్టోబరు 10: దోమకు చెందిన ఈడిగి మహేశ్వరి(19) అనే యువతి అదృశ్యమైంది. మహేశ్వరి ఈ నెల 9న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక లేదు. దీంతో ఆమె తల్లి అనసూజ సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విశ్వజాన్ తెలిపారు.