దివ్యాంగులను ఆదరించండి
ABN , First Publish Date - 2022-09-20T05:18:59+05:30 IST
దివ్యాంగులను ఆదరించండి
యాచారం, సెప్టెంబరు 19: దివ్యాంగులను ఆదరించాలని యాచారం మండలం మాల్ సర్పంచ్ పడకంటి కవితశేఖర్ అన్నారు. సోమవారం మాల్లో 20మంది దివ్యాంగులకు తన స్వంత ఖర్చుతో బస్పా్సలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల మానవత్వంతో మెలగాలన్నారు. వారిపై చిన్నచూపు తగదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వైవీ రాజు పాల్గొన్నారు.