విద్యార్థులు కరాటే, తైక్వాండోల్లో రాణించాలి
ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST
విద్యార్థులు కరాటే, తైక్వాండోల్లో రాణించాలి
ట్కేసర్, జులై 3 : విద్యార్థులు కరాటే, తైక్వాండోల్లో రాణించాలని ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావనీ జంగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఘట్కేసర్లోని కేవీఆర్ఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో తైక్వాండోలో శిక్షణ పొందిన విద్యార్థులకు ఆమె బెల్టులను ప్రదానం చేశారు. అనంతరం తైక్వాండో శిక్షకులను సన్మానించారు. వైస్ చైర్మన్ మాధవరెడ్డి, నిర్వాహకుడు సాయితేజ, అంజనేయులు, హనుమంత్, జహంగీర్, నాగరాజు, రహీం, తదితరులు పాల్గొన్నారు.