విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T06:02:03+05:30 IST

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
మాట్లాడుతున్న నర్సింగ్‌రావు

మొయినాబాద్‌, జూన్‌ 29: విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని  ప్రముఖ చిత్ర నిర్మాత, కళాకారుడు బి.నర్సింగ్‌రావు అన్నారు. మండలంలోని జేబీఆర్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన కళావాహిని బెటాలియన్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ క్యాంపస్‌ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా అన్ని రంగాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆర్కిటెక్ట్‌ గాయిత్రిని ఆయన అభినందించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన కళాఖండాలను సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌.కవిత, ప్రొఫెసర్‌ గాయిత్రి, నగరంలోని వివిధ ఇనిస్టిట్యూట్‌లు జేఎన్‌ఎఫ్‌, సీఎ్‌సఐఐటీ, ఎస్‌వీసీఏ, జేఎన్‌ఐఎస్‌, ఐసీఎ్‌ఫఏఐ, గీతం వోక్స్‌నెస్‌, డెక్కన్‌ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:02:03+05:30 IST