అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు : ఎంపీవో
ABN , First Publish Date - 2022-06-25T05:30:00+05:30 IST
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు : ఎంపీవో
శామీర్పేట, జూన్ 25 : అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేసి కఠిన చర్యలను తీసుకుంటామని మూడుచింతలపల్లి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) రవినాయక్ హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఎడిషన్లో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘అనుమతి లేకుండానే ఇళ్ల నిర్మాణాలు’ అనే శీర్షికతో వార్తాకథనం ప్రచురితమయింది. దీంతో శనివారం మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. ఎంపీవో రవినాయక్ ఆదేశాల మేరకు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత సిబ్బందితో కలిసి వెళ్లి జేసీబీతో కొల్తూర్ పరిధిలోని సర్వేనెంబర్-3లో అక్రమంగా నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు.