హన్మాన్ ఆలయంలో వెండి కిరీటం చోరీ
ABN , First Publish Date - 2022-11-16T00:09:15+05:30 IST
మండల కేంద్రంలోని హన్మాన్ ఆలయంలో ఆంజనేయస్వామి వెండి కిరీటం చోరీకి గురైంది.
మర్పల్లి, నవంబరు 15: మండల కేంద్రంలోని హన్మాన్ ఆలయంలో ఆంజనేయస్వామి వెండి కిరీటం చోరీకి గురైంది. సోమవారం ఉదయం పూజారి ఆలయంలో పూజలు నిర్వహించి గుడిని మూసి వెళ్లిపోయారు. సాయంత్రం వచ్చి చూడగా హన్మాన్ విగ్రహం వెండి కిరీటం చోరీకి గురైనట్లు గుర్తించారు. కిరీటం దాదాపు 15తులాల వరకు ఉంటుందని, విలువ రూ.10 వేల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.