Road Accident: రంగారెడ్డి జిల్లా, గొల్లపల్లి స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-12-02T10:38:17+05:30 IST

రంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గొల్లపల్లి స్టేజి వద్ద నిలుచున్న స్కూల్ పిల్లలను ఢీ కొట్టిన టిప్పర్ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకుపోయింది.

Road Accident: రంగారెడ్డి జిల్లా, గొల్లపల్లి స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గొల్లపల్లి స్టేజి వద్ద నిలుచున్న స్కూల్ పిల్లలను ఢీ కొట్టిన టిప్పర్ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో విద్యార్థి లారీ టైర్ కింద ఇరుక్కుని మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించనున్నారు. టిప్పర్ లారీ విద్యార్థులను ఢీ కొట్టిన సమయంలో ప్రక్కన గేదె ఉంది. లారీ ఢీ కొట్టిన తీవ్రతకు అది కూడా మృతి చెందింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-02T10:38:20+05:30 IST