భక్తిభావంతోనే శాంతి
ABN , First Publish Date - 2022-12-31T23:59:17+05:30 IST
భక్తి భావంతో శాంతి చేకూరుతుందని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా స్టాడింగ్ కమిటీ చైర్పర్సన్, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి తెలిపారు.
కేశంపేట, డిసెంబరు 31: భక్తి భావంతో శాంతి చేకూరుతుందని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా స్టాడింగ్ కమిటీ చైర్పర్సన్, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి తెలిపారు. షాద్నగర్ సమీపంలోని శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవాగమ సంస్కృత వేద పాఠశాలలో జడ్పీటీసీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం శివలింగ అభిషేకం చేశారు. అదేవిధంగా వేద పాఠశాలలో అన్నదానం చేశారు.