‘పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం ఇవ్వాలి’

ABN , First Publish Date - 2022-09-12T05:18:28+05:30 IST

‘పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం ఇవ్వాలి’

‘పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం ఇవ్వాలి’

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 11: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి నెలకు రూ.8,500 వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల 3వ మండల మహాసభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడారు. మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. పంచాయతీ కార్మికులకు పీఎఫ్‌, ఈఎ్‌సఐ సౌకర్యం కల్పించాలన్నారు. అంతేగాక పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యూనియన్‌ మండల కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్‌ మండల గౌరవాధ్యక్షుడిగా సీ.హెచ్‌.బుగ్గరాములు, మండల అధ్యక్షుడిగా బాలప్ప, కార్యదర్శిగా దేవదాసు, కోశాధికారిగా భాస్కర్‌, ఉపాఽధ్యక్షుడిగా మల్లేష్‌, నర్సింహ, సహాయ కార్యదర్శిగా యాదయ్యలను ఎన్నుకున్నారు.  సమావేశఽంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పాండు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-12T05:18:28+05:30 IST