కన్హా శాంతివనంలో పోస్టాఫీస్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-28T05:25:46+05:30 IST
కన్హా శాంతివనంలో పోస్టాఫీస్ ప్రారంభం
నందిగామ, మే 27: మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన సబ్పోస్టాఫీసును శుక్రవారం హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ విద్యాసాగర్రెడ్డి, కర్నూల్ రీజియన్ పోస్ట్మాస్టర్ విశాలాక్షి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కన్హా శాంతి వనానికి ధ్యానం కోసం దేశవిదేశాల నుంచి రోజూ వేల సంఖ్యలో అభ్యాసకులు వస్తుంటారని, వారికి తపాలా సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. పోస్టాఫీసులు మొబైల్ బ్యాంకింగ్ ప్రారంభించామన్నారు. పోస్టల్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిబ్బందికి సూచించారు తపాలా ఉప కార్యాలయంలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తపాలా కార్యాలయం ఏర్పాటుకు సహకరించిన కన్హా శాంతివనం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పోస్టల్ అధికారులు వెంకటేశ్వర్లు, ఎంఏ.జుబేర్, దం డప్ప, కన్హా సర్పంచ్ సరిత, శాంతివనం ప్రతినిధి వినీత్సింగ్, పోస్టుమాస్టర్లు పాల్గొన్నారు.