లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు
తూప్రాన్ (మనోహరాబాద్), జూలై 2 : లారీ ఢీకొన్న ఘటనలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లాల్గడి మలక్పేట్కు చెందిన సల్లూరి రవి (38) తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం మనోహరాబాద్ మండలం దండుపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈక్రమంలో కాలినడకన మనోహరాబాద్ బస్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా తూప్రాన్ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో రవిని స్థానికులు తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉం డటంతో 108 అంబులెన్స్లో సికింద్రాబాద్లోని గాంధీకి తరలించారు.