నాయీ బ్రహ్మణ సంఘం కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2022-08-16T06:01:03+05:30 IST
నాయీ బ్రహ్మణ సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆమనగల్లు, ఆగస్టు 15: ఆమనగల్లు మండల నాయీ బ్రాహ్మణ సేవాసంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవాసంఘం ఉపాధ్యక్షుడు కాన్గుల దశరథం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడిగా కాన్గుల గణేష్, పట్టణ అధ్యక్షుడిగా దేవరకొండ రమే్షలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జంపుల యాదగిరి, జాజాల రాంచంద్రయ్య, ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్, గుద్దేటి బాలు, సహయ కార్యదర్శిగా నాగేష్, వినయ్, కోశాధికారులుగా శివరాం, వెంకటేష్, గౌరవాధ్యక్షులుగా యాదయ్య, కార్యవర్గ సభ్యులుగా సాయి, సురేష్, మురళి, శివ, శేఖర్, ప్రశాంత్ ఎన్నికయ్యారు.