మున్సిపల్ సిబ్బంది బూస్టర్ డోస్ వేసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-25T05:05:27+05:30 IST
మున్సిపల్ సిబ్బంది బూస్టర్ డోస్ వేసుకోవాలి
వికారాబాద్/దోమ/తాండూరు/పరిగి జనవరి 24: ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ సెకండ్ డోస్, బూస్టర్డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి వ్యాక్సినేషన్ను ఆమె పర్యవేక్షించారు. కమిషనర్ శరత్చంద్ర, మాజీ వైస్చైర్మన్ రమే్షకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని దోమ సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. గ్రామ వీధుల్లో హైడ్రో క్లోరినేషన్ పిచికారి చేయించారు. నాయకులు చంద్రశేఖర్, రమేశ్, యాదయ్య పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ కార్మికులు, సిబ్బందికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేశారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని పరిగి ఎంపీడీవో శేషగిరిశర్మ అన్నారు. నారాయణపూర్లో ఫీవర్ సర్వేలో పాల్గొన్నారు. వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. 60ఏళ్లు నిండి రెండు డోస్లు తీసుకున్న వారు బూస్టర్ డోసు తీసుకోవాలన్నారు.